కావలసిన పదార్దాలు:
పనీర్: మూడు వందల గ్రాములు.
రైస్:పావుకేజీ
నూనె: మూడు వందల గ్రాములు అంటే రెండు కప్పుల నూనె తీసుకోవచ్చు.
ఆనియన్స్:అయిదు
పచ్చిమిర్చి:అయిదు
అల్లం, వెల్లుల్లి పేస్టు:రెండు టీ స్పూన్స్.
ఉప్పు:రుచికి తగినంత.
పెరుగు:ఒక కప్పు.
దనియాల పౌడర్:రెండు టీ స్పూన్స్.
జీర పౌడర్:రెండు టీ స్పూన్స్
కొత్తిమీర:కొంచెం
పుదినా:కొంచెం
కరివేపాకు: మూడు రెమ్మలు
ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి . ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తరువాత ఆనియన్స్, పచ్చిమిర్చి తరువార పనీర్ ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వేగిన తరువాత పెరుగు వేయాలి తరువార కొత్తిమీర, కరివేపాకు, పుదినా వేసి బాగా కలపాలి .
ఇప్పుడు ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, దనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలిపి వేరే బవెల్ లోకి తీసుకొని ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఏంటో రుచి కరమయిన పనీర్ పలావ్ రెడీ.