Monday, September 24, 2012

కాప్సికం బటానీ కూర

కావలసినవి 
కాప్సికం           :     పావుకేజీ 
బటాని              :     1 కప్పు 
ఉల్లిపాయలు      :      2
అల్లంవెల్లుల్లిపేస్టు :      1 స్పూన్ 
నూనె                :     1 గరిట 
ఉప్పు               :      తగినంత 
కారం                :      తగినంత 
జీలకర్ర పొడి       :      1 స్పూన్ 
దనియాల పొడి   :      1 స్పూన్ 
వామ్ము             ;      1/2 స్పూన్ 
సోంపు               :       1/2 స్పూన్   
కరివేపాకు           :      కొంచెం 
కొత్తిమీర              :      కొంచెం 

ముందుగ బటానిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి  పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం నూనె వేడెక్కిన  తరువాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేగిన తరువాత కాప్సికం వేసుకొని కొంచెం వేగిన తరువాత ఉడికించిన బటాని వేసుకోవాలి.
ఇప్పుడు అందులో  కొంచెం నీళ్ళు పోసి (1 గ్లాస్ )జీలకర్ర పొడి, దనియాల పొడి, సోంపు, వామ్ము ఉప్పు, కారం అన్ని వేసి దగ్గరగా అయ్యేంత వరకు వుంచి కరివేపాకు , కొత్తిమీర వేసి కూరని సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోండి .

Sunday, September 23, 2012

దోసకాయ కూర

దోసకాయ కూర         :      1/2 కిలో 
పచ్చిమిర్చి                :        6
నూనె                        :         25 గ్రాములు 
ఎండుమిర్చి                :        2
వెల్లుల్లి పాయలు          :        4 
ఉల్లిపాయ                    :        1
ఉప్పు, పసుపు, కారం  :        తగినంత 
తాలింపు గిన్జేలు           :        2 స్పూన్లు 
కరివేపాకు, కొత్తిమీరా    :        కొంచెం 
దనియాల పొడి             :       1 స్పూన్ 

తయారి విదానము

దోసకాయ చెక్కు తీసి చేదులేకుండా చూసుకోవాలి.
చిన్ని, చిన్ని ముక్కలుగా తరగాలి.
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవి నూనె పోసుకొని కొంచెం వేడి అయిన తరువాత  ఎందు మిరపకాయలు,తాలింపు గిన్జేలు వేసుకొని  కొంచెం వేగిన తరువాత ఉల్లిపాయలు , పచ్చి మిరపకాయలు దోసకాయ ముక్కలు వెల్లుల్లి , కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తరువాత  కొంచెం నీళ్ళు పోసుకొని పసుపు , కారం, ఉప్పు , దనియాల పొడి
వేసుకొని ఒక 15 నిముషాలు ఉంచిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.

బియ్యపిండి గారెలు

బియ్యం పిండి  :    4 కప్పులు 
పెరుగు            :     2 కప్పులు 
ఉల్లిపాయలు    :     2
అల్లం              :      కొంచెం 
నూనె             :     డీప్ ఫ్రై  చేయటానికి తగినంత 
కరివేపాకు      :      కొంచెం 
పచ్చిమిర్చి     :      5
ఉప్పు            :     తగినంత    

తయారి విధానము:

బియ్యపిండి బరకగా వుండాలి.  బియ్యపిండిని  ఒక గిన్నెలోకి తీసుకోని అందులో  పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు తగినంత , జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు అన్ని వేసి బాగా  గారెల  పిండిలా కలుపుకోవాలి.  15 నిమిషాలు పిండిని పక్కన పెట్టి ఆతరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి బాగా నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిని గారేలుగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంఛి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.


Saturday, September 15, 2012

మ్యాంగో ఐస్ క్రీం

కావలసినవి:
బంగిన పల్లి మ్యాంగో              :        3
పంచదార                             :        5 స్పూన్స్ 
నిమ్మరసం                           :        1 స్పూన్ 
పాలు                                   :        1 లీటర్ 
ఐస్ క్రీం పౌడర్                       :        2 స్పూన్స్ 

 మామిడి కాయను తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సిలో వేసి నిమ్మరసం,పంచదార  కలిపి బాగా గుజ్జుగా అయ్యే వరకు చేయాలి.
ఇప్పుడు పాలు బాగా మరిగించి రెండు వంతులు మరిగిన తరువాత తయారు చేసి పళ్ళ గుజ్జును కలపాలి. దించేటప్పుడు  ఐస్ క్రీం పౌడర్ను వేసి బాగా కలిపి ఇప్పుడు  ఆ మిశ్రమాన్ని ఒక ట్రే లోకి తీసుకోవాలి. చల్లారిన తరువాత దీప ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచాలి .
తరువాత ఐస్ క్రీం  కప్స్  లోకి తీసుకొని కావాలంటే జీడి పప్పు , బాదం తో అలంకరించి సర్వే చేసుకోవచ్చు.
అందరు ఇష్టపడే మ్యాంగో ఐస్ రెడీ.




కోకోనట్ ఖీర్

పాలు                                  :      3 లీటర్లు 
పచ్చి కొబ్బరి  చిప్పలు          :       2
బాదం పప్పు                        :       తగినన్ని 
 జీడి పప్పు                          :        తగినన్ని 
పిస్తా పప్పు                          :         తగినన్ని 
పాలకోవా                             :         150 గ్రాములు 
పంచదార                             :         6 స్పూన్స్ 

తయారి విదానము :


మూడుగా కొబ్బరి తురుముకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలు పోసి  వేడయిన తరువాత కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపి ఉడికించాలి . తరువాత పాలకోవా, పంచదార వేసి సన్నని  సెగఫై  ఉడికించాలి. 

ఇలా 10 - 15 నిమిషాల తరువాత జీడి పప్పు, పిస్తా బాదం అన్ని వేసుకొని బాగా కలపాలి.
ఇది వేడి గ అయిన తినవచ్చు లేదా ఫ్రిజ్ లో వుంచి బాగా చల్లగా అయిన తినవచ్చు.


Friday, September 14, 2012

క్యాబేజీ పచ్చడి


కావలసినవి:
క్యాబేజీ                 :    1/2 కిలో
కారం                    :    100 గ్రా
ఉప్పు                   :    100 గ్రా 
ఆవపిండి               :    2 చెంచాలు 
మెంతి పిండి           :   1 చెంచా 
నిమ్మరసం             :   5

తయారీ విదానము :
క్యాబేజిని తరిగి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి.
తడి అంతా ఆరిపోయాక  క్యాబేజీ ముక్కలన్నీ ఒక జాడీలోకి పోసి ఉప్పు కలుపుకోవాలి.
మూడు రోజుల తరువాత తీసి ఒక బేసిన్ లో పోసి కారం, నిమ్మకాయ రసం కలపాలి.
దానికి ఆవపిండి, మెంతిపిండి కూడా కలపాలి. ఇప్పుడు  నూనెను పోసి జాదిలోకి పెట్టుకోవాలి.
అవసరమయినప్పుడు పచ్చడిని పోపు పెట్టుకొని తినవచ్చు.



అరటిపండ్ల జామ్

కావాలసినవి :
బాగా మగ్గిన అరటిపండ్లు   :   1 కప్పు 
సిట్రిక్ ఆసిడ్                     :    1/4 స్పూన్ 
పంచదార                         :     3/4 కప్పు 
 
బాగా మగ్గిన అరటిపండ్లును గుజ్జుగా చేసి 1 కప్పు  ఒక గిన్నెలోకి తీసికోవాలి. అందులో సిట్రిక్ ఆసిడ్ , పంచదార  కలిపి కొంచెం నీళ్ళు పోసి సన్నని సెగ ఫై  ఉడికించాలి .  అంతా దగ్గరగా వచ్చేవరకు ఉంచి తరువాత దించేసి ఒక పొడి సీసాలో భద్ర పరుచుకోవాలి.

Thursday, September 13, 2012

బొప్పాయి హల్వా


కావలసినవి:

బొప్పాయి (పచ్చి కాయ) తురుము    :   2 కప్పులు 

పంచదార                                        :    1 1/2 కప్పు 
జీడి పప్పు                                       :    తగినంత 
నెయ్యి                                              :   1 కప్పు 
పచ్చ కర్పూరం                                  :   1/2 స్పూన్ 
యాలుకల పొడి                                 :   1/2 స్పూన్ 

తయారీ విదానము :


బొప్పాయిని చెక్కు తీసి శుభ్రముగా కడిగి గిన్జేలు తెసి బాగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు నీళ్ళు పోసి బాగా పిసికి నీళ్ళు అన్ని వంచేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు  పంచదార ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెమం నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈపంచదార గిన్నె పెట్టి పాకం వచ్చేంత వరకు వుంచి బొప్పాయి తురుముని వేసి, బాగా కలియ బెట్టాలి.తరువాత నెయ్యి వేసి  కలియ బెట్టాలి. తరువాత జీడి పప్పు, పచ్చ కర్పూరం వేసి ఇప్పుడు ఒక ప్లేట్ లో పోసి  అంతా సమంగా అని ముక్కలుగా కోసుకోవచ్చు.

అంతే  వేడి వేడి  బొప్పాయి హల్వా తినటానికి రెడీ ఆరోగ్యానికి చాలా మంచిది.




Tuesday, September 11, 2012

గోంగూర పచ్చడి

గోంగూర                    2 కేజీలు 
చింతపండు                150 గ్రాములు 
కారం                         200 గ్రాములు 
పచ్చి శనగ పప్పు       4 చెంచాలు 
పసుపు                      2 చెంచాలు 
ఆవాలు                      4 చెంచాలు 
ఇంగువ                       కొంచెం 
నూనె                         150 గ్రాములు 

తయారు చేయు విధానము 

చింతపండుని బాగా శుభ్రంగా చేసి వెడి నీళ్ళలో ఒక గంట నానబెట్టాలి.
నూనె కాచి గొంగురని  వేయించాలి.
 ఇప్పుడు గొంగురని ఉప్పు, కారం వేసి మెత్తగా రుబ్బాలి.
ఇప్పుడు చింత పండు పిసికి చిక్కగా పులుసు తీసి బాగా కాగిన నూనెలో ఎండు మిర్చి, పచ్చిశనగ పప్పు, ఆవాలు వేయించి అందులో చిక్కగా పిండుకున్న చింత పండు పులుసు పోసి కాస్త పసుపు వేసి పొయ్యి మీద ఉడకబెట్టాలి,.
గుజ్జుగా వుడికిన తరువాత ఇంగువ వేసి రుబ్బుకున్న గోంగూర కలపాలి.
చల్ల్లరిన తరువాత జాది లో పెట్టుకోవాలి.

 

డ్రయి ఫ్రూట్ లడ్డులు

బాదం         :      200 గ్రాములు 
జీడి పప్పు   :     100 గ్రాములు 
పిస్తా            :     100 గ్రాములు 
కిస్మిస్         :      50 గ్రాములు 
పంచదార     :      అరకేజీ 
యాలుకలు  :      10 (పొడి చేయాలి)
నెయ్యి          :      పావుకేజీ 

ముందుగ ఫైన  చెప్పిన ప్రకారం బాదాం, జీడిపప్పు, పిస్తా ని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత పంచదార గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసుకోన్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కిస్స్మిస్స్ , యాలుకలు పొడి చేసి కలుపుకోవాలి .
మిశ్రమాన్ని బాగా కలిపి అందులో గోరువెచ్చని నెయ్యిని ని మిశ్రమం లో వేసి బాగా కలపాలి.
ఇప్పడు ఆ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకోవాలి.
ఏంతో  రుచికరమయిన  డ్రయిఫ్రూట్  లడ్డులు తినటానికి రెడీ.

Friday, September 7, 2012

రవ్వదోసె

కావలసినవి :
ఉప్మా రవ్వ  (బొంబాయి రవ్వ)       :       2 1/2 కప్పులు 
మైదా పిండి                                 :      1 కప్పు 
బియ్యప్పిండి                               :       1 1/2 కప్పు 
అల్లం                                          :        కొంచెం 
పచ్చి మిర్చి                                 :        4
జీలకర్ర                                        :        2 టీ స్పూన్స్ 
ఉప్పు                                         :         తగినంత 
 పెరుగు                                       :         హాఫ్ కప్పు 

తయారీ విదానము:

ఉప్మారవ్వ, మైదా పిండి, బియ్యప్పిండి  అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో అల్లం పచ్చిమిర్చి ముక్కలు  సన్నగా తరిగినవి , తగినంత ఉప్పు  అందులో వేసి ఇప్పడు వాటికి పెరుగు వేసి ( పెరుగు కావాలంటే కలపుకోవచ్చు లేదంటే అవసరం లేదు) ఇప్పుడు నీటిని పోసి బాగా జారుగా కలుపుకోవాలి. అంటే దోసె పిండి లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఓక్ 15 నిమిషాలు నానబెట్టిన తరువాత  స్టవ్ వెలిగించి దోసె ల పెన్నం పెట్టుకొని కొంచెం పెన్నం వేడెక్కిన తరువాత నూనె వేసి పలుచగా దోసెలు వేసుకోవాలి.
బంగారు రంగు వచ్చిన్దనుకున్నాక  దోసె ను రెండో వైపు  కూడా కాలనిచ్చి దోసెను తీసి సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.
అంతే గుమ గుమ లాడే రావ్వదోసెలు రెడీ.


 

Thursday, September 6, 2012

వెన్న ఉండలు

వెన్న ఉండలు రెండు రకాలుగా చేసుకోవచ్చు . ముదురు పాకం మరియు గులాబ్జాం పాకం 

కావలసినవి:

వెన్న                                     : పావుకేజీ 
మైదా                                     : పావుకేజీ 
నూనె                                     : తగినంత 
యాలుకలు                             : 5
పంచదార కానీ లేక బెల్లం          :  అరకేజీ 
(అవసరమైతే పాలు కొంచెం కలుపుకోవచ్చు  పిండి కలిపేటప్పుడు )

ముందుగ  మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వెన్న వేసి బాగా కలిపి ముద్దగా గులాబ్జాం  పిండి లాగ  ముద్ద గా చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇప్పుడు స్టవ్

వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె ఫ్రయి చేయటానికి సరిపోయేంత పోసుకొని బాగా కాగిన తరువాత చేసి పెట్టుకున్న ఉండలను నూనె లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని వాటిని  తాయారు చేసి పెట్టుకున్న పాకం లో వేసుకోవాలి. ఇప్పుడు యాలుకలు వేసి బాగా కలియబెట్టాలి .
అదే ముదురు పాకం అయితే వుండలన్ని వేసి బాగా కలియబెట్టాలి . పాకం వుండలకి పట్టేల కలియబెట్టాలి 
ఇప్పడు స్టవ్ వెలిగించి పంచదార ఒక గిన్నెలోకి తీసుకొని అందులో  2 టీ గ్లాసులు నీరు పోసుకొని  గులాబ్ జం పాకం లాగ చేసుకోవచ్చు లేదా ముదురు పాకం అరిసెల పాకం లాగ చేసుకోవచ్చు.







Wednesday, September 5, 2012

ధనియాల చారు

కావలసినవి :
ధనియాలు         :      3 స్పూన్స్ 
అల్లం                  :      కొంచెం 
నూనె                  :     1 గరిట 
చింతపండు         :       కొంచెం 
వెల్లుల్లి                :      4  రెబ్బలు 
తాలింపు గిన్జేలు  :       2 టీ స్పూన్స్  (ఆవాలు,పచ్చి శనగ పప్పు, జీలకర్ర )
కరివేపాకు           :       కొంచెం 
కొత్తిమీర              :      కొంచెం

తయారీ విదానము :

ధనియాలు, అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరుకోవాలి.
చింతపండు, ఉప్పు వేసిన 2 గ్లాసుల నీరు, పసుపు, కరివేపాకు వేసి మరిగించాలి.
మరుగుతున్నప్పుడు దనియాల ముద్ద వేసి బాగా మరిగిన తరువాత కొత్తిమీర వేసి తాలింపు పెట్టాలి.
వేడి వేడి  ధనియాలు చారు రెడీ .

నిమ్మకాయ పచ్చడి


నిమ్మకాయలు      :       25

మెంతులు             :       100 గ్రాములు :మెంతులు వేయించి మెత్తగా పొడి చేసి కలపాలి)
ఉప్పు                   :       1/4 కిలో 
కారం                     :       తగినంత
పసుపు                 :       1 స్పూన్  

నిమ్మకాయలు బాగా కడిగి వాటిని తడిలేకుండా బాగా తుడిచి నలుగు ముక్కలుగా కోసుకోవాలి. అందులో ఫైన చెప్పిన ప్రకారం ఉప్పు,  కారం, పసుపు వేసి కలియ బెట్టాలి.
మూడవ రోజున వీటిని గట్టిగా పిండి ఒక జాడిలోకి  తీసుకొని అందులో మెంతి పొడిని వేసి బాగా కలిపి 1 లేదా 2 రోజుల తర్వాత ఉపయోగించుకోవచ్చు.ముక్కలు బాగా వూరి తినటానికి రుచిగా వుంటుంది . కార్డ్  రైస్  లో బాగుంటుంది.


పుదినా పచ్చడి

పుదినాకులు                             :       1కప్పు     
అల్లం                                        :        కొంచెం 
ఉల్లిపాయలు                             :        1
టమాటాలు                               :        2
పచ్చిమిరపకాయలు                  :        3
చింతపండు  లేదా నిమ్మరసం      :       1 టేబుల్ స్పూన్ 
దనియల పొడి                           :        1 టీ స్పూన్ 
జీలకర్ర  పొడి                              :        1 టీ స్పూన్
ఉప్పు                                        :        తగిననత 

ముందుగ  పుదినాకులను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పుదినా, మిర్చి విడివిడిగా వేయించకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
తరువాత ఫైన చెప్పిన మిశ్రమాలన్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .



Saturday, September 1, 2012

పల్లీ (వేరుశనగ పప్పులపొడి ) (కారం)

పల్లీ (వేరుశనగ పప్పులపొడి )(కారం)  


కావలసిన పదార్దాలు:

పల్లీ  పప్పులు      :     200 గ్రాములు 
జీలకర్ర                :      గుప్పెడు 
ఎండుమిర్చి         :      10
వెల్లుల్లి                :      4 రేకులు 
ఉప్పు                 :      తగినంత 
నూనె                 :       4-5 స్పూన్స్ 

ముందుగ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫైన చెప్పిన ప్రకారం నూనె వేసి కొంచెం వేడి అయిన తరువాత ఎండుమిర్చి , పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి  అన్ని 3-4 నిమిషాలు వేపి అందులో ఉప్పు తగినంత వేసి గ్రైండ్ చేసుకుంటే ఏంటో రుచిగా వుండే పల్లీల పదో రెడీ ఇడ్లీ లోకి ఇంకా దోసలోకి చాల బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాల మంచిది ........



కరివేపాకు కారం

కరివేపాకు కారం ఎలా చెయ్యాలో చూద్దామ .......................?

కావలసిన పదార్దాలు :


కరివేపాకు             :            3 కట్టలు 

 జీలకర్ర్ర                 :           10 గ్రాములు 
మినపప్పు             :           50 గ్రాములు 
ఎండుమిర్చి           :            15 
చింతపండు            :            గోళీకాయంత ఉప్పు     
దనియాలు             :            దోసెడు
వెల్లుల్లి                    :            5 రెబ్బలు 
ఉప్పు                    :            సరిపడినంత 
నూనె                     :            1 చెంచా 

ముందుగ స్టవ్ వెలిగించి కడాయి పీతుకొని అందులో  1 చెంచా  నూనె వేసి  అందులో మినపప్పు , ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ,ఎండుమిర్చి( తొడిమలు తీయాలి), కరివేపాకు ఒక  2-3 నిమిషాలు వేయించి అన్నిటిని కలిపి ఉప్పు వేసుకొని దానితో పాటుగా చిన్తపదుని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .............


ఇష్టమైన వారు రోట్లో కూడా దంచుకోవచ్చు .....





అరటిపండు పూరీలు

అరటిపండు పూరీలకు కావలసిన పదార్దాలు:

గోధుమ పిండి          :        3 కప్పులు 

పాలు                      :        3/4 కప్పు 
నూనె                      :         తగినంత 
అరటిపళ్ళు              :          3
ఉప్పు                      :          1/4 టేబుల్ స్పూన్ 

గోడుమపిండి , అరటిపండు , పాలు , ఉప్పు కలిపి బాగా మెత్తగా ముద్దగా చేసుకోవాలి. 10-15 నిముషాలు తరువాత
ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరిలుగా వత్తుకొని తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత వత్తుకొని వున్న పూరిలను నూనె వేసి దోరగా వేయించుకుంటే వేడి వేడి కమ్మని పూరి తినటానికి రెడీ......


ఒకసారి ట్రై చేసి చుడండి....................